రాజీవుని ఉత్తమ నిర్ణయం!

June 28th, 2010

ఆకాళరాత్రి (డిసెంబర్ 2-3, 1984) మీరు ఎక్కడ ఉన్నా రు? భోపాల్ విషవాయువు దుర్ఘటనపై కిందిస్థాయి న్యాయస్థానం ఒకటి పక్షం రోజుల క్రితం తీర్పు వెలువరించి న దరిమిలా న్యూస్ మీడియాలో పదే పదే ప్రస్తావనకు వస్తు న్న ప్రశ్న అది. దీనికంటే చాలా ముఖ్యమైన, సరైన సమాధా నం కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రశ్న: ఆ ఘోర పారిశ్రామిక ప్రమాదం సంభవించిన వారం రోజుల లోపే యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ ఆండర్సన్ భార త్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతించిందెవరు? సప్తపదుల, అష్టపదుల వయస్సులో ఉన్న, దాదాపుగా విశ్రాంత జీవితం గడుపుతున్న రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వాధికారులు ఈ ప్రశ్నకు విశ్వసనీయమైన సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తున్నారు, కాదు ప్రయాసపడుతున్నారు.

ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ప్రత్యేక దర్యాప్తు అవసరమేమీలేదు. నిజానికి భారత ‘రాజ్యమే’ ఆండర్సన్ స్వదేశానికి ‘సురక్షితంగా’ వెళ్ళిపోవడానికి అనుమతించింది. ఈ వాస్తవాన్ని ధ్రువీకరిస్తున్న (లిఖితపూర్వక, దృశ్యపరమైన) సాక్ష్యాధారాలు కావలసినన్ని ఉన్నాయి. 1984లో భారత ‘రాజ్యం’అంటే -భోపాల్‌లో అర్జున్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, న్యూఢిల్లీలో రాజీవ్ గాంధీ సారథ్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం.

దురదృష్టవశాత్తు ఈ మౌలిక వాస్తవాన్ని ఆమోదిస్తున్నవారు ఎవరూ లేనట్టుగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రతిరోజూ ఖండన ప్రకటనలు వెలువడుతున్నాయి; నిన్న చెప్పినదాన్ని నేడు కాదంటున్నారు; రేపు కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు! ఇదంతా ఒక ప్రహసనంలా సాగిపోతోంది. ఎందుకంటే 15 వేల మందికి పైగా ప్రజలు చనిపోయిన ఒక దుర్ఘటనతో ఏమీ సంబంధం లేనట్టుగా ప్రకటనలు, వాటికి ఖండనలు వెలువడుతున్నందునే అలా అభివర్ణించవలసి వచ్చింది.

బుద్ధుడు మాదిరిగా అర్జున్ సింగ్ మౌనం వహిస్తున్నారు; కాంగ్రెస్ తమ ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీని సమర్థించడాని కి అతిగా ప్రతిస్పందిస్తోది. ఇక ప్రతిపక్షాలు అయితే భోపాల్ దుర్ఘటన సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అత్యవసర పరిస్థితి విధింపుతో పోలిక పెడుతున్నాయి.

నిజానికి అర్జున్ సింగ్ మౌనంగానీ, రాజీవ్ ప్రతిష్ఠకు మచ్చబడుతుందేమోననే అనుమానంతో కాంగ్రెస్ పార్టీ గుండె బాదుకోవడం గానీ సమర్థనీయం కాదు. ఆండర్సన్ స్వేచ్ఛగా స్వదేశానికి వెళ్ళిపోయేందుకు అనుమతించేందుకు తనకు అధికారం లేదని అర్జున్ సింగ్ అనడం హాస్యస్పదం గా లేదూ? మధ్యప్రదేశ్ నాడు అర్జున్ సింగ్ పాలనలో ఉన్న ది.

రాష్ట్రంలో ఆయన మాటకు తిరుగులేదు. పైగా ఆండర్సన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానంలోనే న్యూఢిల్లీకి వెళ్ళిపోయా రు. ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఐపిసి సెక్షన్ 304 (హత్యగాని మానవ హతం) కింద నమో దు చేసిన ఆరోపణలను ట్రయల్ కోర్ట్‌లో పోలీసులు తొలగించారు. ఎందుకు తొలగించారు? ఎవరి ఆదేశాలపై అర్జున్ సింగ్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే హక్కు దేశ ప్రజలకు ఉన్నది.

అయితే ఆండర్సన్ ‘పలాయనం’లో రాజీవ్ గాంధీకి ఆపాదిస్తున్న ప్రమేయం విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అంతగా కలవర పడుతున్నారు? ప్రతిపక్షాలు ఎందుకంత తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాయి? నెహ్రూ-గాంధీ వంశంతో పేగు సంబంధమున్న కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వెలువడే ఎంత చిన్న వ్యాఖ్యపైన అయినా పెద్దగా మండిపడుతుంది.

అందునా భోపాల్ విషవాయువు దుర్ఘటనకు సంబంధించిన ఆండర్సన్ ‘పలాయనం’ విషయంలో రాజీవ్ ప్రమేయమున్నదని అంటే ఇక చెప్పేదేముంది? ‘ఈ వ్యవహారంలోకి రాజీవ్ పేరును లాగడం ఎంత సాహసం’అని కాంగ్రెస్ బడా, చోటా నాయకులు గర్జిస్తున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత ప్రాతిపదికగా దశాబ్దాల నుంచి మనుగడ సాగిస్తున్న ప్రతిపక్షా లు భారత రాజకీయాల ప్రథమ కుటుంబా న్ని ఇబ్బంది పెట్టడానికి దొరికిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాయి?

ఆండర్సన్‌ను భారత్ నుంచి స్వేచ్ఛగా స్వదేశానికి వెళ్ళిపోనివ్వడంలో ఇబ్బంది కల్గించే అంశమేమీ లేదు. ఆ మేరకు నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ తీసుకొని వున్నట్టయితే అది ఆయ న తీసుకున్న ఉత్తమ నిర్ణయాలలో ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు (అటువంటి ముఖ్యమైన నిర్ణయం గురించి ప్రధానిగా ఉన్న వ్యక్తికి తెలియదనడం విశ్వసించలేని విషయం కాదూ?) బాబ్రీ మసీదు గేట్లు తెరిపించినందుకు, 1987లో జమ్మూ- కాశ్మీర్ శాసనసభా ఎన్నికలలో రిగ్గింగ్ జరపడానికి రహస్యంగా సమ్మతించినందుకు, ఎల్‌టిటిఇ సమస్య విషయంలో అనుసరించిన వైఖరికి మీరు రాజీవ్‌ను తప్పుపట్టవచ్చు.

ఈ అంశాలన్నిటిలోనూ ఆయన నిర్ణయాలు భయాన క పర్యవసానాలకు దారితీశాయి. అయితే ఆండర్సన్ వ్యవహారంలో ఆయన, బహుశా, సరైన ప్రత్యామ్నాయాన్నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. 1984 డిసెంబర్ 2010 జూన్ కాదు. భోపాల్ దుర్ఘటనకు కొద్ది వారాల ముందే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దరిమిలా దేశ రాజధానిలో సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు తిరుగుబాటు కార్యకలాపాలతో అతలాకుతలమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి సజావుగా లేదు. మరికొద్దిరోజుల్లో సార్వత్రక ఎన్నికలు జరగనున్న తరుణమది. ముట్టడిలో ఉన్న జాతి మనది.

అంతేకాదు అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ప్రతిష్ఠ మహోజ్వలంగా వెలిగిపోతో న్న కాలమది. వాషింగ్టన్ పాలకుల మాటకు ఎక్కడా తిరుగులేదు. మిగతా ప్రపంచమంతటికీ నాగరికత లేదా ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించే హక్కు తమకు మాత్రమే ఉన్నదని అమెరికా పాలక వర్గాలు ప్రగాఢంగా విశ్వసిస్తోన్న రోజులవి. మితవాది రోనాల్డ్‌రీగన్ పాలనా కాలమది. సైనిక-పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా అంతిమ విజయానికి చేరువలో ఉన్నది. మరి మన దేశం హిందూ ఆర్థికాభివృద్ధి రేటుతో కునారిల్ల్లుతోంది. ప్రపంచ అగ్రరాజ్యాన్ని సవాల్ చేయగల స్థితిలో లేదు. రాజీవ్‌కు రోనాల్డ్ రీగన్ ఫోన్ చేసి ఆండర్సన్‌ను విడిచి పెట్టమని అడిగినప్పుడు అతడిని స్వేచ్ఛగా తిరిగి వెళ్ళనీయడమే సరైన నిర్ణ యం. జాతి ప్రయోజనాలను రక్షించే ఆచరణాత్మక నిర్ణయం. అటువంటి నిర్ణయాన్నే రాజీవ్ తీసుకున్నారు.

దేశ ప్రతిష్ఠకు నిజమైన కళంకం 1984 డిసెంబర్ 7 (ఆండర్సన్ భారత్ నుంచి నిష్క్రమించిన రోజు)న కాక, ఆ దుర్ఘట న చోటుచేసుకున్న 26 ఏళ్లకు సంభవించింది. విషవాయువు దుర్ఘటన బాధితులకు 470 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేలా భారత ప్రభుత్వం, యూనియన్ కార్బైడ్ కంపెనీ మధ్య మన సుప్రీం కోర్టు 1989లో మధ్యవర్తిత్వం నెరపింది. బాధితులు లక్ష మందికి కొంచెం ఎక్కువగా ఉంటారని అధికార వర్గాల అంచనా. వాస్తవానికి అంతకు ఐదు రెట్లు ఎక్కు వ సంఖ్యలో ఉన్నారు. ఎవరికీ నష్టపరిహారం సరిగ్గా చెల్లించ నే లేదు.

భోపాల్ కేసులో నిందితులపై అభియోగాలను సుప్రీం కోర్టు 1996లో ఇచ్ఛా పూర్వకంగానే నీరుకార్చివేసింది. అయి తే సిబిఐ ఆ నిర్ణయాలను సవాల్ చేయలేదు. భోపాల్ కేసులో తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మది ఆ తరువాత భోపాల్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్‌కు చైర్మన్ గా నియమితులయ్యారు. విషవాయువు దుర్ఘటన బాధితుల కు వైద్యదుపాయాలు కల్పించడానికి నెలకొల్పిన ఆస్పత్రి అది. అయితే పలువురు బాధితులకు ఈ ఆస్పత్రిలో వైద్యం అందలేదని ఇటీవల పలు వార్తలు వెల్లడించాయి.

1984 నుంచి మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్, బిజెపి రెండూ పాలించాయనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. కాంగ్రెస్ అత్యధిక కాలం (19 ఏళ్లు) పాలించింది. భోపాల్‌లోని జెపి నగర్ కాలనీకి వెళ్ళండి. ఆ కాలనీలో ఆ కాళరాత్రి 300 మందికి పైగా మరణించారు. మరెంతో మంది శ్వాససంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మరి ఆ బాధితుల ను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏమైనా చేశాయా? చేయలేదనేది స్పష్టం. రెండేళ్ల క్రితం వారిలో కొందరు న్యూఢిల్లీలో ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళారు. దరిమిలా ఆ అభాగ్యులు వారం రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. ఆండర్సన్‌ను ఎవరు వదిలిపెట్టారనేది ముఖ్యం కాదు. విషవాయువు దుర్ఘటన బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వానికి 26 ఏళ్లు ఎందుకు పట్టిందనేదే అసలు ప్రశ్న.

తాజా కలం: 1984లో భారత్‌లో ఆండర్సన్ కార్యకలాపాలపై తీసిన విడియోను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. 24 గంటల న్యూస్ చానల్స్ ప్రాబల్యం వెలిగిపోతున్న ఈ కాలంలో యూనియన్ కార్బైడ్ అధిపతి నవ్వులు చింది స్తూ ‘బై,బై ఇండియా’ అంటూ నిర్భయంగా మన దేశం నుంచి నిష్క్రమించడం సాధ్యమయ్యేదేనా?

Tell me why ?

October 23rd, 2009

This kid has amazing talent and very touching song.. Check about him here 

Lyrics:

In my dream children sing a song of love for every boy and girl
The sky is blue and fields are green and laughter is the language of the world
Then I wake and all I see is a world full of people in need

Tell me why (why) does it have to be like this?
Tell me why (why) is there something I have missed?
Tell me why (why) cos I don’t understand.
When so many need somebody we don’t give a helping hand.
Tell me why?

Everyday I ask myself what will I have to do to be a man?
Do I have to stand and fight to prove to everybody who I am?
Is that what my life is for to waste in a world full of war?

Tell me why (why) does it have to be like this?
Tell me why (why) is there something I have missed?
Tell me why (why) cos I don’t understand.
When so many need somebody we don’t give a helping hand.
Tell me why?

(children) tell me why? (declan) tell me why?
(children) tell me why? (declan) tell me why?
(together) just tell me why, why, why?

Tell me why (why) does it have to be like this?
Tell me why (why) is there something I have missed?
Tell me why (why) cos I don’t understand.
When so many need somebody we don’t give a helping hand.

Tell me why (why,why,does the tiger run)
Tell me why (why why do we shoot the gun)
Tell me why (why,why do we never learn)
Can someone tell us why we let the forest burn?

(why,why do we say we care)
Tell me why (why,why do we stand and stare)
Tell me why (why,why do the dolphins cry)
Can some one tell us why we let the ocean die ?

(why,why if we’re all the same)
tell me why (why,why do we pass the blame)
tell me why (why,why does it never end)
can some one tell us why we cannot just be friends?

Sizzling sridevi

October 13th, 2009

అతిలోక సుందరి ..భూలోక అప్సరస

where is tollywood

October 12th, 2009

మన వెండితెర వేలుపులు ఎవరన్నా కానివ్వండి – మెగా కావచ్చు పవర్ కావచ్చు , మైటీ కావచ్చు లేదా ఏదో ఒక సామ్రాట్టో రత్నమో కావచ్చు అంతా దాదాపు ఒకటే , వారి వారి గాజు భవనాలలో ఉండి పైసా పోకుండా చక్కెర కన్నా తీయని కబుర్లు చెపుతారు .

వారు సినిమాలు చేసేదే మనకోసం . మనం బాధపడతామనే వారు , వారి సంతానం పగలనక రాత్రనక కష్టపడి , శిక్షణ తీసుకుని మరి మన కోసం సినిమా చేస్తారు . సినిమా వంద రోజులకి దగ్గరలో ఫలానా థియేటర్ నుంచి ఎత్తివేస్తున్నారు అంటే ఫ్యాన్స్ బాధపడతారు అని ఎదురు డబ్బు కట్టి మరీ ఆడిస్తారు రికార్డ్ ‌ ల కోసం . అదే ఫ్యాన్స్ ప్రకృతి వైపరీత్యం వల్ల కష్టాలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వారి గాజు భవనాలని వదిలి బైటకి రారు .

సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పట్లో ఇలాంటివి ఏమన్నా వస్తే ఇచ్చేవాళ్ళల్లో ముందర ఉండేవారు . ఆయన వారసుడు మహేశ్ ఇలాంటి వాటికి దూరం . ఎన్ . టి . ఆర్ గారు , నాగేశ్వరరావు గారు కూడా బాగా ఇచ్చేవారు , అదీ కాక వారితో చిత్రాలు నిర్మించే నిర్మాత దర్శకులతో కూడా ఇప్పించేవారు . నాగార్జున ఎక్కడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు లేదు . ( మా టీవీ తరఫున ఆయన ఇచ్చినది సొంత డబ్బు కాదు .) తర్వాత శోభన్ ‌ బాబు గారు , కృష్ణంరాజు గారు కూడా ఇచ్చేవారు . శోభన్ గారి వారసులు సినిమా రంగంలో లేరు కాబట్టి మాట్లాడటానికి లేదనుకోవచ్చు . కృష్ణంరాజు గారు చెప్పుకునే వారసుడు మరి ప్రభాస్ గారు ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా సంఘసేవ చేసిన దాఖలా లేదాయె !

ఇంకా చిరంజీవి గారి కుటుంబం గురించి చెప్పనే అక్కరలేదు . ఆయన బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ గురించి మాట్లాడటం తప్ప . హైదరాబాద్ ‌ లో లుంబినీ పార్క్ ‌ లో , గోకుల్ చాట్ భండార్ ‌ లో బాంబ్ బ్లాస్ట్ ‌ లు జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఆయన , ఆయన సోదరులు , బావగారు . ఇప్పుడు కూడా రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇచ్చారు కాని ‘ యువరాజు ‘ పవన్ ఎక్కడా పత్తా లేరు . ఒకప్పుడు ఈయనే “కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ” అని పెట్టి అప్పటి జీవన సహచరి , ఇప్పటి భార్య అయిన రేణుక గారికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు . అది పోనీ అన్నగారి పార్టీలో కలిసి పోయింది అనుకుందాం , మరి ఆ కామన్ మ్యాన్ కి ఇప్పుడు కష్టం వచ్చింది కదా , మరి ఈ ” కొమరం పులి ” గుహలో నుంచి వచ్చి సహాయపడిందా అంతే ఎక్కడా కనపడటం లేదు మరి . నాగబాబు సరే సరి … తోటల్లో అప్పట్లో సభలు పెట్టారు అది చేస్తాం , ఇది చేస్తాం అని , అవన్నీ పదవి వస్తేనే తప్పించి ఇప్పుడు కాదా ? వీరికి నిజంగా సేవ చేసే ఉద్దేశమే ఉంటే ఇది సరి అయిన సమయం కాదా ?

సినిమాకి కోట్లు తీసుకునే రవితేజ , పట్టువదలని ఘజనీ మహమ్మదు లాంటి నితిన్ , ఒక్కళ్ళు కూడా ఒక్క మాటా మాట్లాడరేఁ ? సినిమాల్లో అన్ని కబుర్లు చెప్పే మన దర్శకులు చేతల్లో ఎందుకు చూపించటం లేదు ? ఒక్క దర్శకుడు , ఒక్క రచయితా ఎంగిలి చెయ్యి కూడా ఎందుకు విదల్చడం లేదు ? రాజశేఖర్ , శ్రీహరి లాంటి చిన్న నటులు ఎప్పుడూ చేసేవాళ్ళు … ఇప్పుడూ చేస్తున్నారు . మిగిలిన వాళ్ళలో ఆ మాత్రం సామజిక స్పృహ లేదా ? కాల్ ‌ షీట్ కి మూడు లక్షలు తీసుకునే స్టార్ కమేడియన్ బ్రహ్మానందం అయినా ఒక లక్ష పెట్టి బట్టలు , సరుకులు పంపాడు . మిగిలిన కామెడీ గ్యాంగుకి ఎక్కడా చీమ కుట్టినట్టు లేదు మరి .

ఇక మనం రోజూ కొలిచే నాయికల సంగతి చెప్పనే అక్కరలేదు ! వారెవరికీ ఈ సంగతి పట్టదు . వారికి తెలుగు రాదు కదా … అందువల్ల తెలుగునాట ఏం జరిగిందో పాపం వాళ్ళకి అర్ధం కానే కాదు . ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి తెర పైన మనసులు కదిలించే విషాద సంగీతం అందించే సంగీత దర్శకులు ఇళ్ళలోనో రికార్డింగ్ స్టూడియోలోనో ఉండటం వల్లనేమో వారికి ఈ హాహాకార వ్యధాగీతం వినిపించినట్టు లేదు … ఎవరూ స్పందించలేదు మరి ! కోట్లకి కోట్లు ” హీరో ” లకి ముందుగానే ఇచ్చేసి సినిమా పూర్తవుతుందో లేదోనని ఆకాశంకేసి చూస్తూ భయపడుతూ కూర్చునే నిర్మాతలు కూడా ఒక్క చిల్లిగవ్వైనా విదిలించలేకపోయారా ?

తారలు క్రికెట్ ఆడి ఆ సంపాదన సహాయనిధికి ఇస్తాం , అదీ ఇదీ … అని కబుర్లు మాత్రం చెపుతారు . అంటే వీరికి ఆడుకోవడానికి ప్రభుత్వం స్థలం ఇస్తే , వాళ్ళు ఎంచక్కా ఆడుతుంటే , చూడటానికి మనం డబ్బులు ఇస్తే , అవి తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఉదారంగా ఇస్తారు మన కోసం … ఎంత ఉదార స్వభావమో కదా ! … అది గ్రహించాక కూడా మీ కళ్ళ వెంట కన్నీరు రాక పొతే మీది రాతి హృదయం సుమీ …

వీళ్ళని అని లాభం ఏంటి … అసలు మనకి ఉండాలి ! మన హీరో గారి సినిమా ఎవరూ కొనడం లేదు అంటే ఎవరూ ఇవ్వని ధరకి ఇంట్లో సామాను తాకట్టు పెట్టి మరీ మన ఏరియాలో సినిమాలు కొనే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నంతకాలం మన గాజు భవనాల దేవతామూర్తులకి కానీ వారి వారసులకి కానీ ఢోఖా లేదు !

సర్వేజనాః సుఖినోభవన్తు ! ” మమ ” అనుకుని పడుకోవడం , ” ప్రపంచం బాగుంది మన అద్దాల కిటికీలో నుంచి ” అనుకుని నిద్దరోవడం , ఈ వరదలు , అవీ వెలిసాక లేదా మీడియాలో ఈ ” గోల ” అయిపోయాక మళ్ళీ మొదటి ఆటకు సినిమాచూడటానికి వెళ్ళిపోవటం తప్ప చెయ్యగలిగింది ఏం లేదు . ఇది చదివి మనవాళ్ళు మారతారు అనుకోవడం కూడా చాలా తప్పు . మనసు ఊరుకోక వ్రాయడం తప్ప … !

Written by Sri Atluri

రైతుకు ఎంత కష్టం ఎంత కష్టం …

October 8th, 2009

7pan6b[1]

మీ ఆంధరకి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో వరధ వల్ల చాలా మంధీ ప్రజలు సహాయం కోసం ఎధురు చూస్తున్నారు.

తడి ఆరిన కట్టుబత్టలతో వివిధ ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, అభిమాన సంఘాలు తీసుకొస్తున్న అన్నం పొట్లాలు, బిస్కెట్‌ ప్యాకెట్ల కోసం జనం వాహనాల వెంట పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. అనేక మంది దాతలు దుస్తులు తీసుకొచ్చారు. కానీ ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేదు. వారం రోజుల నుంచి స్నానం లేదు. ఆరుబయట చెట్ల కిందే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బట్టలతో పనేముందనుకొన్నారో.. ఏమో.. తెచ్చిన దస్తులను చాలాచోట్ల చెట్లకిందే పడేశారు

లక్ష్మీరెడ్డి. 40 ఎకరాల రైతు. కర్నూలుకు 13 కిలోమీటర్ల దూరంలోని నిడ్జూరు గ్రామానికి చెందిన ఈయన వరద బీభత్సానికి సర్వం కోల్పోయారు. వారం రోజుల కిందట దర్జాగా బతికిన ఈ పెద్దరైతు.. నేడు అందిన రొట్టె తింటూ జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈయనే కాదు.. గ్రామంలో అందరి పరిస్థితి ఇదే.

పచ్చని పొలాలు నేడు వరద వలన రాళ్లతో మన్ను తో గుంటలుగా ఉన్న పొలాలను చూసి కుంగి పోయే పొలం వైపు చూస్తూ కృష్ణమ్మాను అరిచి అడగాలిని ఉంధీ కానీ వారం రోజులుగా గా పస్తులుంటున్న రైతుకు గొంతు రావటం లేదు.

పొలం చూసి భోరున విలపించాలని ఉన్న రైతు కు కన్నీళ్ళు కుడా రావటం లేదు.

రైతుకు ఎంత కష్టం ఎంత కష్టం …

ఈ రైతును మీరు ఆధుకోరు !!! … ఆ ప్రజలని మీరు ఆధుకోరు

donate @ http://www.gwtcs.org

indian piggy bank

October 2nd, 2009

clay-piggy-bank

గుర్తుకొస్తున్నాయీ..

ఈనాడు శ్రీధర్

October 2nd, 2009

ఈనాడు శ్రీధర్ cartoons.. here .

sreedhar

Gandhi in google logo

October 2nd, 2009

gandhi09

పుష్పవీలాపం

October 1st, 2009

పుష్ప విలాపం ఒక గొప్ప కావ్యం . ఇక్కడ మీరు వినవచ్చు

Part One

Part Two

Sunitha flop nusic with hit comedy

October 1st, 2009

Finally done with musical show on Friday night, with out sriya , its big upset. I would like to say BIG thanks to VN Aditya he tried maximum to get sriya to DC. But , u know how actresses are .. she wanna go to club in NY , so she ditched our program.

 

She just say single line “Miss communication, sorry” . These actresses are very bad with schedule and timings in movies and every where . They simple say sorry for all mistakes.

Sunitha .. she is simple a dubbing artist. Singing songs also she thought its dubbing.. :) . Can some one expect Singer Usha singing Athadu Dole Dole song..:) but she did it it great way ., Sunitha tried some of the mass songs.. na.. she is just dubbing singer :)

In the show people enjoyed lot with comedy . I though this comedy scripted and directed by VN Aditya . Its bug hit. Man these Venky & Venu are great comedians.

The highlight of the show is Comedy scripts. I would like to big thanks to organizers of this event Siddhartha creations.

Srikrishna .. hmm.. he is very nice kid.. people enjoyed teasing him :) He is great singer.. …

[sunitha1244983190.jpg]